విశాఖ మన్యం మీదుగా అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వాహనాన్ని నర్సీపట్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గాదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.
అక్రమంగా పశువులు తరలింపు.. అడ్డుకున్న భాజపా నేతలు - నర్సీపట్నం పశువుల అక్రమ రవాణా న్యూస్
అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వాహనాన్ని భాజపా నేతలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది.
![అక్రమంగా పశువులు తరలింపు.. అడ్డుకున్న భాజపా నేతలు animals illegal transport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8864269-584-8864269-1600537149038.jpg)
అక్రమంగా పశువులు తరలింపు
విశాఖ మన్యం మీదుగా సీలేరు, భద్రాచలం, ఖమ్మం రోడ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు భాజపా నేతలు వివరించారు. అడ్డుకున్న ఈ వాహనాల్లో సుమారు 45 పశువులు ఉన్నట్లు నేతలు వివరించారు. వాహనాలను పోలీసులకు అప్పగించి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అక్రమంగా పశువులు తరలింపు