ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా పశువులు తరలింపు.. అడ్డుకున్న భాజపా నేతలు - నర్సీపట్నం పశువుల అక్రమ రవాణా న్యూస్

అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వాహనాన్ని భాజపా నేతలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

animals illegal transport
అక్రమంగా పశువులు తరలింపు

By

Published : Sep 19, 2020, 11:49 PM IST

విశాఖ మన్యం మీదుగా అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వాహనాన్ని నర్సీపట్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గాదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

విశాఖ మన్యం మీదుగా సీలేరు, భద్రాచలం, ఖమ్మం రోడ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు భాజపా నేతలు వివరించారు. అడ్డుకున్న ఈ వాహనాల్లో సుమారు 45 పశువులు ఉన్నట్లు నేతలు వివరించారు. వాహనాలను పోలీసులకు అప్పగించి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:అక్రమంగా పశువులు తరలింపు

ABOUT THE AUTHOR

...view details