Andhra University land issue: ఆంధ్ర విశ్వవిద్యాలయం, అటవీశాఖలకు చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకోసం సర్వే చేయడం ఏంటని.... రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భూమిని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భూమి పరిరక్షణకు అటవీ శాఖ వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి.
'కడప జిల్లాకు చెందిన నేతల కోసమే విశాఖ భూములను అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప రాజకీయ నేతలుఉత్తరాంధ్రలోనిరిజర్వుడు ఫారెస్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం భూములను కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులతో వచ్చి సర్వే చేయడం జరిగింది. దీనికి జీవీఎంసీ టౌన్ అధికారి చంద్రశేఖర్ దగ్గరుండి సర్వే చేశారు. ఇదంతా చూస్తుంటే అవినీతి ఏవిధంగా జరుగుతుందో అన్నవిషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కలెక్టర్కి ఫిర్యాదు చేశాం'.-పీతల మూర్తియాదవ్, జనసేన కార్పొరేటర్.