అనకాపల్లిలోని శారదా కాలనీ వద్ద పావని అనే యువతి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. తన బ్యాగ్ పోగొట్టుకుంది. అందులో బంగారు వస్తువులు, రూ.4,500 నగదు, చరవాణి ఉన్నాయి. అదే కాలనీకి చెందిన దుర్గాదేవి అనే మహిళ బ్యాగ్ను గుర్తించి.. పట్టణ పోలీస్స్టేషన్లో అప్పగించింది. విలువైన వస్తువులు ఉన్నప్పటికీ నిజాయతీగా బ్యాగ్ను.. తీసుకొచ్చి ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అభినందించారు.
అనకాపల్లిలో నిజాయతీ చాటుకున్న మహిళ - anakapalli latest news
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ మహిళ నిజాయతీ చాటుకుంది. ఒక యువతి పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులకు అందించి అభినందనలు పొందింది.
![అనకాపల్లిలో నిజాయతీ చాటుకున్న మహిళ anakapalli police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10099422-455-10099422-1609638454328.jpg)
పోలీసులకు బ్యాగ్ అప్పగిస్తున్న మహిళ