విశాఖను అభివృద్ధి చేసింది గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే అని అనకాపల్లి శాసన సభ్యుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 2004 నుంచి 2009 వరకు ఎస్ఈజడ్లో 5 వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖలో ఆరోగ్య పరంగా విమ్స్ , సినీ రంగ పరంగా రామానాయుడు స్టూడియో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే వచ్చాయని చెప్పారు. తెదేపా హయాంలో విశాఖ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విశాఖలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖను అభివృద్ధి చేసింది వైకాపానే: గుడివాడ - గుడివాడ అవర్ననాథ్ విశాఖ అభివృద్ధి
విశాఖ వైకాపా కార్యాలయంలో.. ఆ పార్టీ నేత గుడివాడ అమర్ననాథ్ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ శ్రద్ధను కొనియాడారు. ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను తోసిపుచ్చారు.
![విశాఖను అభివృద్ధి చేసింది వైకాపానే: గుడివాడ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4528807-31-4528807-1569248830855.jpg)
గుడివాడ అమర్ననాథ్
సమావేశంలో మాట్లాడుతున్న గుడివాడ అమర్ననాథ్