ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎండను పట్టించుకోకుండా.. మద్యం కోసం బారులు తీరారిలా!

By

Published : May 4, 2020, 12:35 PM IST

మండుతున్న ఎండను సైతం పట్టించుకోకుండా.. మందుబాబులు సరుకు కోసం ఆరాటపడుతున్నారు. చాలా రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోగా.. మద్యం కోసం పెద్ద సంఖ్యలో తరలుతున్నారు.

vishaka district
మద్యం దుకాణాల ముందు బారులు తీరిన మందుబాబులు

విశాఖ జిల్లా పాయకరావుపేట ప్రధాన రహదారిపై ఉన్న మద్యం దుకాణం తెరవకముందే ఉదయం 9 గంటలనుంచే మందుబాబులు క్యూ కట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులకు కష్టతరంగా మారింది. పదకొండు గంటలకి దుకాణాన్ని తెరిచారు.

ధరల పట్టికకు సంబంధించిన అనుమతి రాని కారణంగా... 12 గంటలు దాటినా అమ్మకాలు చేయలేదు. నియోజకవర్గ అన్ని దుకాణాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. అయినా.. మద్యం కొనుగోలు కోసం ఓపికగా మందుబాబులు ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details