ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2020, 3:19 PM IST

ETV Bharat / state

'భారత్ బంద్​లో అందరూ భాగస్వామ్యులవ్వాలి'

రైతులకు నష్టాన్ని కలిగించే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని... విశాఖ జిల్లాలోని చిన్న రుషికొండ కూడలి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

aituc protest at vishaka over agriculture bills
'భారత్ బంద్​లో అందరు భాగస్వామ్యులవ్వాలి'

విశాఖ జిల్లా చిన్న రుషికొండ కూడలి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. దిల్లీలో రైతులు జరుపుతున్న నిరసనకు మద్దతుగా అన్ని వర్గాల వారు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు.

డిసెంబర్ 8న జరగనున్న భారత్ బంద్​లో... ఆటో- మోటారు కార్మికులు, చిల్లర వర్తకులు, ముఠా కార్మికులు పాల్గొనాలని... ఆటో డ్రైవర్స్- వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి కోరారు. మోటారు వాహనాలపై భారీగా జరిమానాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details