రవాణా రంగంలోని ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాహన పన్ను, బీమా 50 శాతం తగ్గించాలని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లో ఆటోలు నడపడానికి అవకాశం కల్పించాలని కోరుతూ... ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు.
'ఆటో నడవకపోతే... పూట గడిచేదెలా' - ఆటో డ్రైవర్లపై కరోనా ఎఫెక్ట్
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పని లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తమకు.. ఆటోలను నడుపుకునే అవకాశం కల్పించాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు వినతి పత్రం అందచేశారు.
!['ఆటో నడవకపోతే... పూట గడిచేదెలా' aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7111425-706-7111425-1588930948259.jpg)
aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam