ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ, సీఐటీయూ నిరసన - AITUC and CITU protest against central government anti-labor policies

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ, సీఐటీయూ సంయుక్తగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టారు.

AITUC and CITU protest against central government anti-labor policies
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటియుసి, సిఐటియు నిరసన

By

Published : Jul 3, 2020, 9:57 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ, సీఐటీయూ సంయుక్తగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టారు. భాజపా అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. లాక్​డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు 10 వేల రూపాయలు మూడు నెలలపాటు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాల సవరణను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు అజశర్మ , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వామన మూర్తి, జిల్లా సమితి సభ్యులు గోవింద్, మధు రెడ్డి, సి.వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details