విశాఖ జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో మూడో రోజూ అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. పద్మనాభం మండలంలో భారీగా పట్టాదారు పాసు పుస్తకాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మధార కార్యాలయంలో లంచం ఆరోపణల ఫిర్యాదులు, దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డిజిటల్ కీ వినియోగం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.
నిన్న 12 తహశీల్దార్ కార్యాలయాల్లో...
బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 12 తహశీల్దార్ కార్యాలయాల్లో అనిశా తనిఖీలు చేసింది. విశాఖ జిల్లాలోని సీతమ్మ ధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు... ఉద్యోగుల హాజరు, వారి విధి నిర్వహణ పట్టీలు అలాగే అందిస్తున్న సేవలను పూర్తిగా పరిశీలలించారు.