విశాఖ జిల్లా పాడేరులో తొమ్మిదవ తరగతి విద్యార్థిని రక్తహీనతతో మృతి చెందింది. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిగా ఉన్న భాగ్యవతి సెలవులకు తన స్వగ్రామమైన కురిడేలుకు వచ్చింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమెకు.. తొలుత జి. మాడుగులలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున బుధవారం రాత్రి విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ ఆ రోజు రాత్రి మరణించింది.
రక్తహీనతతో తొమ్మిదవ తరగతి గిరిజన బాలిక మృతి - tribal girl died due to haemophelia
విశాఖ జిల్లా పాడేరులో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని రక్తహీనతతో అనారోగ్యానికి గురై.. ప్రాణం విడిచింది.

రక్తహీనతతో తొమ్మిదవ తరగతి గిరిజన బాలిక మృతి
Last Updated : Oct 28, 2019, 8:31 AM IST