ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ తీగ తెగిపడి.. వ్యక్తి మృతి - విశాఖపట్నంలో విద్యుత్ షాక్​తో వ్యక్తి మృతి

సంక్రాంతి పండుగను సరదాగా చేసుకుందామని సొంతూరుకు వెళ్లిన వ్యక్తి.. విద్యుత్ తీగ మీద పడిన ఘటనలో చనిపోయాడు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని చినకోనాంలో ఈ ఘటన విషాదం నింపింది.

A man was killed when a power line was cut in Chidikada zone of Visakhapatnam district
విద్యుత్ తీగ తెగిపడి వ్యక్తి మృతి..

By

Published : Jan 14, 2021, 5:14 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం చినకోనాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతిని కుంటుంబంతో సరాదాగా గడుపుదామని స్వగ్రామానికి వెళ్లిన ఓ వ్యక్తి.. విద్యుత్ తీగ తగిలి చనిపోయాడు. జూరెడ్డి వరాహమూర్తి (33).. అచ్యుతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. సంక్రాంతికి భార్య, పిల్లలతో కలిసి సొంతూరు చినకోనాం చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు.. భూమిని చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి అతని పై పడింది. ఈ ప్రమాదంలో వరాహమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

కరెంట్ స్తంభం వద్ద మెరుపులు వస్తున్న సమయంలో విద్యుత్ ఉప కేంద్రానికి సమాచారం ఇచ్చినా.. పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details