ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ తగ్గాలని ఖరగ్​పూర్​ నుంచి తిరుపతికి పాదయాత్ర - man pilgrimage from Kharagpur to Tirupati

కరోనా మహమ్మారి తగ్గాలని పశ్చిమ బంగాల్ ఖరగ్​పూర్ నుంచి తిరుపతికి ఒక వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 10న ఈ యాత్ర ప్రారంభించగా.. పాదయాత్ర ద్వారా విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకున్నారు.

A man  pilgrimage from Kharagpur to Tirupati
కోవిడ్ తగ్గాలని ఖరగ్​పూర్​ నుంచి తిరుపతికి ఓ వ్యక్తి పాదయాత్ర

By

Published : Dec 9, 2020, 1:37 PM IST

Updated : Dec 9, 2020, 2:31 PM IST

కొవిడ్ తగ్గి..ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓ వ్యక్తి పశ్చిమ బంగాల్ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నారు. ఖరగ్​పూర్​కు చెందిన రవి అనే వ్యక్తి కిళ్లీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా తగ్గాలని రోజుకి 20 కిలీమీటర్లు నడుస్తూ..ఈ రోజు విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకున్నారు. పట్టణంలోని గౌరీ సేవా సంఘం సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. గౌరీ పంచాయతన దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి .. తిరుపతి బయల్దేరారు. కొవిడ్ అందరి జీవితాలు నాశనం చేసిందని ..దీని ప్రభావం తగ్గి కరోనా లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నానని రవి వివరించారు.

Last Updated : Dec 9, 2020, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details