ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

lorry burned: జాతీయ రహదారిపై లారీ దగ్ధం..

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ(a lorry burned at kagita toll plaza) దగ్ధమయ్యింది. ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి.

By

Published : Nov 10, 2021, 9:55 PM IST

a lorry burned at kagita toll plaza
కాగిత టోల్ గేట్ లారీ దగ్ధం

కాగిత టోల్ గేట్ వద్ద లారీలో చెలరేగిన మంటలు.. లారీ దగ్ధం

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమయ్యింది. తెలంగాణలోని కోదాడ నుంచి అనకపల్లికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ.. టోల్ గేట్ వద్ద ఆగింది. ఈ క్రమంలో డ్రైవర్ భోజనం చేస్తుండగా లారీలోని ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే వాహనాన్ని చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం చాలా మేర కాలిపోయింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details