పంచాయతీ ఎన్నికల లెక్కింపు విషయంలో అవకతవకలు జరిగాయని.. విశాఖలోని ఆనందపురం మండలం గండిగుండం వాసులు ఆందోళన చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట.. గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేష్ తరుపు 700 మంది మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఎన్నికలు లెక్కింపు సజావుగా జరగలేదని ఆరోపించారు. రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపు వ్యవహారంలో 21 ఓట్లకు అవకతవకలు జరిగాయని.. బాధిత అభ్యర్థి రమేష్ ఆరోపణలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు అక్కడి నుంచి కదిలేదని లేదని స్పష్టం చేశారు.
పల్లెపోరు: రీపోలింగ్ నిర్వహించాలని గండిగుండం వాసుల ఆందోళన - రీపోలింగ్ నిర్వహించాలని విశాఖలోని గండిగుండం వాసుల ఆందోళన
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగలేదని.. విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట గండిగుండం వాసులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్కింపు వ్యవహారంలో 21 ఓట్లకు అవకతవకలు జరిగాయని.. బాధిత సర్పించి అభ్యర్థి రమేష్ ఆరోపణలు చేశారు. 700 మంది మద్దతుదారులు ఆందోళనలో పాల్గొనటంతో.. కలెక్టరేట్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.
పల్లెపోరు: రీపోలింగ్ నిర్వహించాలని గండిగుండం వాసుల ఆందోళన