ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సహాయనిధికి మూడు లక్షల విరాళం - సీఎం సహాయనిధికి మూడు లక్షల విరాళం

కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఓ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం 3 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మెుత్తాన్ని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అందజేశారు.

By

Published : May 2, 2020, 4:39 PM IST

కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని... చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. సీఎం సహాయనిధికి స్టోన్ క్రషర్స్ యాజమాన్యం 3 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ చెక్కును ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు చోడవరం నియోజకవర్గం నుంచి సీఎం సహాయనిధికి 75 లక్షలు సమకూరాయన్నారు. వైరస్ నియంత్రణకు స్వీయ నియంత్రణ అవసరమని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ... భౌతిక దూరాన్ని పాటించి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details