కారులో164కిలోల గంజాయిని తరలిస్తున్నా ముగ్గురిని విశాఖ జిల్లా,పెందుర్తిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కృష్ణరాయపురం వద్ద సోదాల్లో భాగంగా తమిళనాడుకు చెందిన కారును తనిఖీ చేయగా,ఈ గంజాయి పట్టుబడిందని పోలీసులు పేర్కొన్నారు.గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితుల్లో ఒకరు పరారవ్వగా,ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు.నిందితుల నుంచి19వేల నగదు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు.
విశాఖ పోలీసులకు చిక్కిన తమిళనాడు గంజాయి ముఠా - 164 kgs ganja cought vsp police
గంజాయి రవాణపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నా, స్మగ్లర్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా, గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ పోలీసులకు చిక్కిన తమిళనాడు గంజాయి ముఠా
విశాఖ పోలీసులకు చిక్కిన తమిళనాడు గంజాయి ముఠా
ఇదీ చదవండి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు సీజ్