ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో ప్రధాని మోదీ - సోమవారం స్వామివారి దర్శనం - PM Moid Tirumala tour

PM Narendra Modi Tirupati Tour: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేయనున్న ప్రధాని.. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అతిథి గృహం వద్ద ప్రధానికి టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డితోపాటు.. ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలుకారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, ప్రధానికిొ స్వాగతం పలికారు.

PM_Narendra_Modi_Tirupati_Tour
PM_Narendra_Modi_Tirupati_Tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 10:52 PM IST

PM Narendra Modi Tirupati Tour: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Justice Abdul Nazeer), సీఎం జగన్‌ (CM YS Jagan) స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. వారందరికీ మోదీ అభివాదం చేశారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి తిరుమల చేరుకుని.. రచన అతిథి గృహానికి రోడ్డుమార్గం ద్వారా చేరుకున్నారు.

అనంతరం రచన అతిథి గృహం వద్ద ప్రధానికి టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డితో (TTD Chairman Karunakar Reddy) పాటు.. ఈవో ధర్మారెడ్డి (TTD Executive Officer Dharma Reddy) స్వాగతం పలికారు. ప్రధాని రాత్రి తిరుమలలో బస చేయనున్నారు (Prime Minister Narendra Modi Reached Tirumala) సోమవారం ఉదయం 8 నుంచి 8.45 గంటల మధ్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు. అనంతరం 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణలోని హకీంపేటకు చేరుకొని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు.

విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది : మోదీ

మోదీ రాకకు ముందే ఏర్పాట్లు పూర్తి: మోదీ రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాని మోదీ బస తదితర అంశాలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో అంతకముందే సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో వీవీఐపీల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ ఈవోకు కూడా తెలిపారు.

రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న మోదీ- షెడ్యూల్ ఖరారు

PM Modi in Telangana Election Campaign: అంతకుముందు తెలంగాణలో తూప్రాన్‌లో (PM Modi Speech in Toopran) జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కలవని సీఎం ఎందుకని.. ఆయన ఎప్పుడూ సచివాలయానికి రారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పం మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తాం : నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details