ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2022, 10:45 AM IST

ETV Bharat / state

ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం.. ఇచ్చిన ప్రతి హామీని సీఎం అమలు చేస్తున్నారు: మంత్రి రోజా

Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాయటంలో అర్థం లేదని పర్యాటకశాఖ మంత్రి రోజా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఆమె అన్నారు.

Etv Bharat
Etv Bharat

Minister Rk Roja ఏపీని అప్పులపాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు లేఖ రాయడంలో అర్థం లేదని పర్యాటకశాఖ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. తిరుపతి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కుంటి సాకులతో తప్పించుకునేవాడని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కుల, మత బేధాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాలు తమ పార్టీ గెలుస్తుందని రోజా ధీమా వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details