ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటం.. నిబంధనలకు విరుద్దం

By

Published : Jan 5, 2023, 1:22 PM IST

Bhanu Prakash Reddy Comments: తిరుపతి కొండపై రాజకీయాలు మాట్లడటం బాధకరమని.. భాజపా నేత భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల పలువురు వైసీపీ నేతలు రాజకీయాల లక్ష్యంగా కొండపై వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై రాజకీయాలు మాట్లడటం నిబంధనలకు విరుద్దమని ఆయన అన్నారు.

Bhanu Prakash Reddy
భాజపా నేత భాను ప్రకాష్ రెడ్డి

BJP leader Bhanu Prakash Reddy Comments: తిరుపతి కొండపై రాజకీయా ప్రసంగాలు చేయడం.. నిబంధనలకు విరుద్దమని, భాజపా నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీనల వైసీపీ నేతలు తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వేదికగా చేశారని, ప్రతి పక్షాలను తిడుతూ రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే నియమ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయా పార్టీలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుమల కొండపై రాజకీయాలకు తావులేకుండా చేయాల్సిన బాధ్యత తితిదేపై ఉందన్నారు. రాబోవు రోజుల్లో తిరుమలలో రాజకీయ విమర్శలు చేసిన వారిని తిరుపతిలో అడ్డుకుంటామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details