ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాక వేసుకోవాలనుకున్న వ్యక్తిపై వైకాపా కార్యకర్తల దాడి - శ్రీకాకుళం వైకాపా నేతల వార్తలు

తనకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో పశువుల పాక వేసుకోవడానికి ఓ వ్యక్తి సామగ్రి వేశాడు. అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.

YCP activists attack on person at nakkapeta in srikakulam district
YCP activists attack on person at nakkapeta in srikakulam district

By

Published : May 28, 2020, 8:46 AM IST

పాక వేసుకోవాలనుకున్న వ్యక్తిపై వైకాపా కార్యకర్తలు దాడి

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నక్కపేట గ్రామంలో స్థల వివాదంపై ఇరువర్గాలు గొడవ పడ్డాయి. అముజూరి పోతురాజు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో పశువులపాక వేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు... అడ్డుకున్న కారణంగా ఘర్షణకు దిగారు. రాజు అనే వ్యక్తి గాయపడగా... ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details