ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2020, 7:07 PM IST

ETV Bharat / state

'ఉద్యోగ భద్రత కల్పించకుంటే.. ఛలో అసెంబ్లీ'

శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలోని మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ ఉద్యోగాలకు భద్రత ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

wine shop employees demand and protest in srikakulam to give employment guarantee
ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ మద్యం షాపుల్లో పనిచేసే యువకులు ఆందోళన

మద్యం​ షాపుల్లో పనిచేస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించవద్దంటూ శ్రీకాకుళంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏపీఎస్​బీసీసీ, పొరుగు సేవల సిబ్బంది ఆధ్వర్యంలో 80 అడుగుల రహదారిలో వీరంతా ర్యాలీ చేశారు.

బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం చేస్తామని ఆ సంఘ నేతలు తెలియజేశారు. ఉద్యోగ భద్రత కల్పించకుంటే.. ఈ నెల 16 న ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details