ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్కలిలో భర్తను హత్య చేసిన భార్య - wife attacked

టెక్కలిలో భర్తను హత్య చేసిన భార్య

By

Published : Oct 5, 2019, 9:48 AM IST

Updated : Oct 5, 2019, 12:03 PM IST

09:42 October 05

తాగి వచ్చి చంపబోయాడని భర్తను హత్య చేసిన భార్య

టెక్కలిలో భర్తను హత్య చేసిన భార్య

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడా గ్రామంలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. నౌపడ జంక్షన్ రైల్వే క్వార్టర్స్ లో ఈ సంఘటన జరిగింది. ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల పైల వెంకట్రావుపై భార్య జగదీశ్వరి  కర్రతో దాడి చేసింది. నిన్న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త తన రెండేళ్ల కుమారుడు సాత్విక్‌తోపాటు తనపైన కిరోసిన్ పోసి నిప్పు పెట్టేందుకు యత్నించాడని ఆరోపిస్తోందామె. ఆత్మరక్షణ కోసమే కర్రతో కొట్టినట్టు ఆ దెబ్బ మెడపై పడినట్టు జగదీశ్వరి చెబుతోంది. మృతుని శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. తల వెనుక భాగం నుంచి రక్త స్రావమైందని వైద్యులు తెలిపారు.

Last Updated : Oct 5, 2019, 12:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details