ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.3 వేలు లంచం తీసుకుంటూ... అనిశాకు చిక్కిన వీఆర్​ఓ - Srikakulam District Mandasa Tehsildar's Office News

ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడి ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారిణి... లంచానికి పాల్పడుతూ అనిశాకు చిక్కారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. వీఆర్వో రేణుకారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

3 వేలు లంచం తీసుకుంటూ... పట్టుబడ్డ వీఆర్ఓ
3 వేలు లంచం తీసుకుంటూ... పట్టుబడ్డ వీఆర్ఓ

By

Published : Mar 18, 2021, 10:42 AM IST

శ్రీకాకుళం జిల్లా మందస తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వో రేణుకారాణి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు. సిరిపురానికి చెందిన రైతు రాజేష్‌ పండా.. మ్యూటేషన్‌ కోసం మీసేవా ద్వారా దరఖాస్తు చేసారు. వీఆర్వో రేణుకారాణి లంచం డిమాండ్‌ చేయగా.. అనిశా అధికారులను రైతు ఆశ్రయించారు.

వీఆర్వో గదిలోనే రైతు రాజేష్‌ పండా లంచం ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన అనిశా అధికారులు.. వీఆర్వోను అరెస్టు చేశారు. విశాఖపట్నం అనిశా కోర్టులో ప్రవేశపెడుతునట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details