కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సుమారు 3 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కోగటం, కంచెన్నగారిపల్లెలో పేదలకు వాటిని అందజేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి తన వంతు సహాయం చేశానని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా చిప్పగిరిలో జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి గ్రామంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. నంద్యాలలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జనసేన సైనికులు తమ వంతు సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం హరిపురం దొడ్డ కాళీ గ్రామాల్లో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీల దాతలు సమకూర్చిన నిత్యావసర వస్తువులను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో నిరంతరం సేవలందిస్తున్న80 మంది పారిశుద్ధ్య కార్మికులకు, 120 మంది వలస కూలీలకు సరకులు అందజేశారు.
రాజాంలోని రజక వీధిలో 160 నిరుపేద కుటంబాలకు బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు పొగిరి సురేష్ బాబు ఆర్ధిక సౌజన్యంతో సమకూర్చిన వస్తువులను.. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అందజేశారు.