ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 13, 2019, 9:46 PM IST

ETV Bharat / state

వాల్మీకి రామాయణం సామాజిక నీతి బోధిస్తుంది: సభాపతి తమ్మినేని

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలో జయంతి కార్యక్రమానికి సభాపతి తమ్మినేని, మంత్రి ధర్మాన, కలెక్టర్ నివాస్ హాజరయ్యారు.

వాల్మీకి రామాయణం సామాజిక నీతి బోధిస్తుంది: సభాపతి తమ్మినేని

వాల్మీకి రామాయణం సామాజిక నీతి బోధిస్తుంది: సభాపతి తమ్మినేని
మహర్షి వాల్మీకి జయంతిని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో జరిగిన కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 24 వేల శ్లోకాలతో రామాయణంను మహర్షి వాల్మీకి రచించారని .... రామాయణం సామాజిక నీతి బోధిస్తుందని సభాపతి తమ్మినేని పేర్కొన్నారు. రామాయణం, భారతం రచించిన వారు వెనకబడిన తరగతులకు చెందినవారు కావడం గమనార్హమని సభాపతి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details