ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు... ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

By

Published : Dec 20, 2020, 7:45 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయలపాలయ్యారు. పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

two-persons-died-in-road-acciden
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్ర వాహనం దగ్ధమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details