ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేల బావిలోకి దూసుకెళ్లిన వ్యాను.. ఇద్దరు మృతి

By

Published : Mar 30, 2021, 11:55 AM IST

ఒడిశా నుంచి విశాఖ వైపు చేపలలోడుతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి జాతీయరహదారి పక్కనున్న నేలబావిలోకి దూసుకుపోయింది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతిచెందారు.

van plunged into a ground well
నేల బావిలోకి దూసుకెళ్లిన వ్యాను

నేల బావిలోకి దూసుకెళ్లిన వ్యాను

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పాకివలస సమీపంలో.. ఉదయం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. ఒడిశా నుంచి విశాఖ వైపు చేపలలోడుతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి జాతీయరహదారి పక్కనున్న నేలబావిలోకి దూసుకుపోయింది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని.. వాహనం, మృతదేహాలను బయటికి తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details