శ్రీకాకుళంలో అధార్ కేంద్రాల్లో అవస్థలపై ఈటీవీ భారత్ కథనంతో,ఆధార్ కేంద్రం వద్ద పరిస్థితులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు.ఉదయం జరిగిన ఘటనకు గుర్తుగా ఉన్న రక్తపుమరకలు,చెప్పులను చూసిన జేసీ వాటి కారణాలను అడిగితెలుసుకున్నారు.రద్దీని తగ్గించేందుకు త్వరలో మరో10కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు.కేవైసి అప్ డేట్ కోసం సమయం పొడిగిస్తామని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు.గందరగోళం,తోపులాట వంటి ఘటనలు జరక్కుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆధార్ అవస్థలపై ఈటీవీ భారత్ కథనంపై జేసీ స్పందన
శ్రీకాకుళం ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై జేసి స్పందించారు. స్వయంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, పరిస్థిని ఆరా తీశారు. త్వరలో మరికొన్ని ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
The response to ETV bharat article on the situation in Adhar centers in Srikakulam.