గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తప్పా లాక్డౌన్కు ఎలాంటి మినహాయింపులు లేవన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్. మండల పరిధిలో మాత్రమే కదలికలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ అయిపోయిన అనంతరం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెన్నై నుంచి వచ్చే మత్స్యకారులకు సముద్ర తీర ప్రాంతాల్లో 40 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆరు బోట్లు సీజ్ చేసి.. 82 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
శ్రీకాకుళంలో మరింత పకడ్బందీగా 'లాక్డౌన్' - ప్రభుత్వ మెడికల్ కళాశాల తాజా వార్తలు
శ్రీకాకుళంలో ఇకనుంచి లాక్డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అమ్మిరెడ్డి, జేసీ శ్రీనివాసులుతో కలిసి పలు విషయాలు వెల్లడించారు.
![శ్రీకాకుళంలో మరింత పకడ్బందీగా 'లాక్డౌన్' lockdown in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6874859-276-6874859-1587417440459.jpg)
శ్రీకాకుళంలో మరింత పకడ్బాందీగా లాక్డౌన్
ఇవీ చూడండి..