శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో కొన్నాళ్లుగా వైకాపాలో ఇరువర్గాల మధ్య గుట్టుగా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇళ్ల పట్టాల పంపిణీలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి బాహాబాహీకి దిగారు. ఓ వైకాపా నాయకుడు ఇంటిపై మరో వైకాపా నాయకుడు దాడి చేశారు. ఇంట్లో సామానులపై తమ ప్రతాపం చూపించారు. అడ్డు వచ్చిన మహిళలకు గాయాలయ్యేలా ఘర్షణకు దిగారు. దీంతో విషయం వైకాపా పెద్దల దగ్గరకు పంచాయితీ చేరింది.
వైకాపా నాయకుల మధ్య బయటపడ్డ విభేదాలు - The battle for supremacy between the ysrcp leaders was exposed
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇళ్ల పట్టాల పంపిణీలో తలెత్తిన వివాదం బాహాబాహికి దారి తీసింది.
![వైకాపా నాయకుల మధ్య బయటపడ్డ విభేదాలు srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8262629-272-8262629-1596303968649.jpg)
వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది