స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ని కోరామని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్దార్ను మాజీ మంత్రి కళావెంకట్రావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుతో పాటు మరికొందరు తెదేపా నేతలు కలిశారు. అధికార పార్టీ నుంచి ఎస్ఈసీకి మానసిక ఒత్తిడి తెస్తున్నారని తెదేపా నేతలు అన్నారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతోందని.. రాజ్యాంగ వ్యవస్థలన్నీ భయపడి పని చేస్తున్నాయని కళా వెంకట్రావు అన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి: తెదేపా - panchayth elections latest news
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ని తెదేపా నేతలు కోరారు. కళా వెంకట్రావు, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఇతర నేతలు ఎస్పీని కలిశారు.

srikakulam tedp leaders on panchyath elections
శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ని కలిసిన తెదేపా నేతలు