శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్ను లేలేత కిరణాలు తాకాయి. సూర్యకిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకే దృశ్యాలను చూసి భక్తులు పులకరించారు. 9 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని చూసే భాగ్యం భక్తులకు కలిగింది. ఉత్తరాయనం, దక్షిణాయనం మార్పుల్లో ఈ కిరణస్పర్శ భాస్కరుని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదీల్లో... అలాగే అక్టోబర్ నెల 1,2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.
అరసవల్లిలో ఆదిత్యుని పాదాలు తాకిన కిరణాలు - సూర్య నారాయణ స్వామిని తాకిన కిరణాలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు ఆదిత్యుని మూల విరాట్ను తాకాయి. భక్తులు భారీ ఎత్తున హాజరై ఈ దృశ్యాలను తిలకించారు.

sun's rays touched the statue of Suryanarayana Swamy in arasavalli temple