ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రిమోట్ కోసం గొడవ... అదృశ్యానికి కారణమైంది..!

By

Published : May 3, 2020, 11:43 PM IST

టీవీ రిమోట్ కోసం జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి అదృశ్యానికి కారణమైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా దూకులపాడులో జరిగింది.

student missing dhookulapadu srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో అదృశ్యమైన బాలుడు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ పదో తరగతి చదువుతున్నాడు. తన తమ్ముడితో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మందలించగా.. రాజశేఖర్ ఇంటి నుంచి పరారయ్యాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details