విద్యార్థి కిడ్నాప్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఒక్కసారిగా కలకలం రేపింది. పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో చదువుతున్న అభిలాష్ అనే ఆరో తరగతి విద్యార్థిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వ్యానులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. బాలుడు కేకలు వేయటంతో సుమారు 3 కిలోమీటర్ల దూరం సమీపంలో విడిచిపెట్టి పరారయ్యారు. అయితే అపహరణకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం - rajam
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్ ఆవరణలోనే అపహరణకు గురవ్వటం స్థానికుల్లో మరింత ఆందోళన కలిగించింది.
![రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6056352-714-6056352-1581576718296.jpg)
రాజాం పట్టణంలో విద్యార్థి కిడ్నాప్
రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం