ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతబొమ్మాళిలో ఎన్టీఆర్​, ఎర్రన్నాయుడు విగ్రహాలు ధ్వంసం - nara Lokesh latest news

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో దివంగత ఎన్టీఆర్​, ఎర్రన్నాయుడు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

santhabommali
santhabommali

By

Published : Jan 12, 2021, 9:08 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్​, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై మండల తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... విగ్రహాలను పరిశీలించారు.

ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాల జోలికి వెళ్లవద్దని అచ్చెన్నాయుడు కోరారు.

దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా దుష్టులే సంతబొమ్మాళి ఘటనకు పాల్పడ్డారు. నిలబెట్టడం చేతగాని జగన్ రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !

ABOUT THE AUTHOR

...view details