శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. మార్కెట్కు వచ్చేవారు భౌతికదూరం పాటించాలని సూచించారు. కిరాణా దుకాణాల వద్ద నియమ నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ రవి సుధాకర్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.
'బయట తిరిగే వారు జాగ్రత్తలు తీసుకోండి'
కూరగాయల మార్కెట్కు, నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారు భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు.
ఆమదాలవలసలో కూరగాయల మార్కెట్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్