ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా వైరస్ ను కేర్ చేయకుండా...గుంపులుగా పూజలు

By

Published : Jun 14, 2020, 6:07 PM IST

కరోనా మహమ్మరి రోజు రోజుకి విజృంభిస్తున్న వేళ ఆ గ్రామంలో జనం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయాన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.

srikakulam dst laveru mandal people not following lockdown rule celebrate temple opening
srikakulam dst laveru mandal people not following lockdown rule celebrate temple opening

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు గుంపులుగా చేరారు.గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని గ్రామ వీధుల్లో సందడి చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

ఇప్పటికే గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాతకుంకాల గ్రామంలో కరోనా పరీక్షలు నిమిత్తం పలువురు అనుమానితులను ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్నినిర్వహించటం మిగిలిన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details