.
'మద్దతు ధరకే రైతుల నుంచి ధాన్యం కొంటున్నాం'
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పెద్దపేట గ్రామంలో కలెక్టర్ నివాస్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో... మద్దతు ధరతో పంటను కొనాలని అధికారులను ఆదేశించారు. వరి కుప్పలను కల్లాల్లోనే పరిశీలించిన కలెక్టర్... ఇప్పటికే జిల్లాలో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కలెక్టర్ నివాస్