ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక జిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు - శ్రీకాకుళంలో కోవిడ్ కేసులు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా తాకిడి మొదలైంది. జిల్లాలో ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి. స్థానికంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లు సమకూర్చింది. ఇక జిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాలపై శ్రీకాకుళం డీఎంహెచ్​వో చెంచయ్యతో ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

డీఎంహెచ్‌వో చెంచయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి
డీఎంహెచ్‌వో చెంచయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి

By

Published : May 2, 2020, 5:49 PM IST

డీఎంహెచ్‌వో చెంచయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వం సమకూర్చిన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా తొలి దశ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పరీక్షల తుది ఫలితాల కోసం కాకినాడ గానీ.. విశాఖ గానీ పంపించాల్సిన పరిస్థితి. ఇక నుంచి తుది ఫలితాలు తెలుసుకునే ల్యాబొరేటరీ జిల్లాలోనే అందుబాటులోకి వస్తుందంటున్న డీఎంహెచ్‌వో చెంచయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇదీ చదవండి :'మడ అడవుల్లో భూ కుంభకోణం.. బురదకాల్వల్లో ఇళ్ల స్థలాలు'

ABOUT THE AUTHOR

...view details