ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేయండి'

By

Published : Apr 25, 2020, 7:23 PM IST

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించాలని.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. పాతపట్నంలో అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్... కరోనా గురించి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

srikakulam district collector nivas sp ammireddy visit paathapatnam
పాతపట్నంలో కలెక్టర్ నివాస్ పర్యటన

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి పర్యటించారు. అనంతరం పాతపట్నం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, పరీక్షలు చేయాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్​లో ఉంటున్నవారి వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details