ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సడలింపులోనూ ఆంక్షలుంటాయ్.. సహకరించండి' - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

శ్రీకాకుళంలో వ్యాపారులతో కలెక్టర్ నివాస్ సమావేశమయ్యారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. మాస్క్​లు లేకుండా వచ్చే వారికి సరుకులు ఇవ్వకూడదన్నారు.

srikakulam collector meeting with merchants
వర్తకులతో సమావేశమైన జిల్లా కలెక్టర్​

By

Published : May 7, 2020, 12:44 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వర్తక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు విధిగా మాస్క్​లు ధరించాలని స్పష్టం చేశారు.

మాస్క్​లు ధరించని వారికి సరుకుల ఇవ్వకూడదని వ్యాపారులను ఆదేశించారు. క్షౌరశాలలకు.. టీ దుకాణాలకు అనుమతివ్వలేదు. హోటల్స్​లో ప్యాకెట్ల ద్వారా టీ విక్రయాలు చేయవచ్చన్నారు. వ్యాపార కార్యకలాపాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతించారు. ఈ చర్యలకు అందరూ సహకరించాలని కలెక్టర్ నివాస్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details