శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే.. ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న కోర్టులో పెండింగ్ లేని ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పీకర్ తెలిపారు.
ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయ్: స్పీకర్ తమ్మినేని - స్పీకర్ తమ్మినేని తాజా వార్తలు
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే..ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ తమ్మినేని శ్రీకారం