ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సభాపతి తమ్మినేని - స్పీకర్ తమ్మినేని తాజా వార్తలు

ప్రజా సంక్షేమమమే ప్రభుత్వ ధ్యేయమని సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

By

Published : Sep 25, 2020, 5:51 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొరగం, బొరగవలస గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు తమ గ్రామాల్లోనే అందాలనే ఉద్దేశంతో రైతుభరోసా కేంద్రాలు, వైఎస్​ఆర్ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details