ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2020, 8:27 PM IST

ETV Bharat / state

గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్​ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండంలోని పలు గిరిజన గ్రామాల్లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో వైకాపా పని చేస్తోందని స్పీకర్ అన్నారు.

tammineni seetaram
tammineni seetaram

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం బుధవారం పర్యటించారు. జంగాలపాడు, లడ్డూరి పేట, బొమ్మిక, కొండపేట గ్రామాలలో సుమారు 7.5 లక్షల అంచనా వ్యయంతో సౌరశక్తి ఆధారిత మంచినీటి సరఫరా పథకాలకు శంకుస్థాపన చేశారు. లడ్డూరిపేట గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. జంగాలపాడు, లడ్డూరిపేట, బొమ్మిక గ్రామాల్లో గిరిజనులకు పట్టాలు అందజేశారు.

ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు, సాగు, తాగునీరు అందించడమే వైకాపా ప్రధాన కర్తవ్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సదుపాయాన్ని గిరిజనులకు చేరాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. సుమారు 30 వేల ఎకరాల భూములను పంపిణీ చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details