ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యవసర సరకుల రవాణా పేరుతో వస్తే కఠిన చర్యలు - కొత్తపేటలో లాక్​డౌన్

శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ను ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. జిల్లాలో మరో మూడు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

SP examined   checkpost   in  kothapet
కొత్తపేట చెక్‌పోస్టును పరిశీలించిన ఎస్పీ

By

Published : Apr 11, 2020, 8:38 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

కరోనా ప్రభావం లేకపోయినా శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరింత జాగ్రత్త పడ్డారు. జిల్లాలోని కొత్తపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టును ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. టెక్కలి, కోటబొమ్మాళి మండలం కొత్తపేట, నవభారత్‌ కూడలిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కరోనా పరీక్షలు చేసి... దగ్గరలోని రిలీవ్ కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. చెక్​పోస్టుల వద్ద రెవెన్యూ సిబ్బందితో వాహనాలు సమకూర్చామని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఆ కేంద్రాల్లోనే వీరిని ఉంచేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిత్యవసర సరకుల రవాణా పేరుతో అక్రమంగా ప్రవేశించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details