కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోటార్లకు, మీటర్లు బిగింపు ప్రతిపాదన వచ్చిందని శైలజానాథ్ అన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతుందని.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి.. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకుందని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మోటార్లకు మీటరు బిగింపుపై తీసుకొచ్చే జీవోతో రైతులకు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని.. పేర్కొన్నారు.
మోటర్లకు మీటర్ల ఏర్పాటు రైతులకు ఆర్థిక భారం: శైలజానాథ్ - జగన్పై ఏపీసీసీ శైలజానాథ్ కామెంట్స్
విద్యుత్ మోటర్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు.
మోటర్లకు మీటర్లు బిగించడం రైతులకు ఆర్థిక భారం: శైలజానాథ్