ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంశధారకు భారీ వరద.. పరివాహక ప్రాంతాలు పరిశీలించిన ఆర్డీవో - వరదల తాజా వార్తలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా ఆర్డీవో నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.

raising of river water level
పెరుగుతున్న నీటిమట్టాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

By

Published : Oct 14, 2020, 5:36 PM IST

శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతోంది. పరివాహక ప్రాంతాలను ఆర్డీవో పరిశీలించారు. నరసన్నపేట మండలం గడ్డవారిపేట, చోడవరం, కామేశ్వరీపేట గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ స్థాయి అధికారులకు ఆర్డీవో సూచించారు. ఆయనతోపాటు తహసీల్దార్, ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటించారు.

ABOUT THE AUTHOR

...view details