ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో రేషన్ డీలర్ల ఆందోళన - రేషన్ డీలర్ల ఆందోళన

ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తుందన్న వార్తలపై చౌక ధరల దుకాణ డీలర్లంతా కలసి శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీ చేశారు. వైకాపా గెలుపులో తమ ప్రోత్సాహమూ ఉందనీ... వ్యవస్థను రద్దు చేయొద్దనీ డిమాండ్ చేశారు.

ర్యాలీ చేస్తున్న రేషన్ డిలర్లు

By

Published : Jul 8, 2019, 7:30 PM IST

ర్యాలీ చేస్తున్న రేషన్ డిలర్లు

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీకాకుళం జిల్లా రాజాంలో డీలర్లు ర్యాలీ చేశారు. అంబేద్కర్ కూడలి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో ఏళ్లగా డీలర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో 29 వేల 500 మంది డీలర్లు పనిచేస్తున్నారని... వీరి పొట్ట కొట్టడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను కొనసాగించి వృత్తి భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు... తహశీల్దార్కు వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details