ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి... నిరసనగా భారీ ర్యాలీ - శ్రీకాకుళం జిల్లా సీతంపేట వద్ద విద్యార్థి సజీవదహనం

బీటేక్ విద్యార్థి నగేశ్ అనుమానస్పద మృతికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవులో భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నగేశ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

student Nagesh died at seethampeta
విద్యార్థి అనుమానస్పద మృతికి నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Jan 30, 2021, 7:23 AM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన మువ్వల నగేశ్.. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే రణస్థలం మండలం సీతంపేట వద్ద అనుమానస్పద స్థితిలో నగేశ్ మృతదేహం లభ్యమైంది.

మృతి పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థి మృతికి కారకులైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్ చేశారు. ఈ మేరకు భారీగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details