ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈదురు గాలులు బీభత్సం.. దెబ్బతిన్న మామిడి పంట - శ్రీకాకుళంలో ఈదురు గాలులు బీభత్సానికి పంట నష్టం వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షానికి.. మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

rain in Srikakulam
ఈదురు గాలులు బీభత్సం

By

Published : Apr 4, 2021, 3:58 PM IST

ఈదురు గాలులు బీభత్సం

శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లా అంతటా దట్టమైన మేఘాలతో పాటు.. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సరుబుజ్జిలి మండలం పాలవలసలో పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందారు.

శ్రీకాకుళం, వీరఘట్టం, ఆమదాలవలస, సీతంపేట, కొత్తూరు, భామిని, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, పాలకొండ, జలుమూరు, సారవకోట తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడైన ఈదురు గాలులు.. మొక్కజొన్న, అరటి తోటలను నేలకూల్చాయి. కూరగాయల పంటలతో పాటు మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details